సినీ రంగంలో విశేష సేవలు అందించిన పలువురు ప్రముఖులకు ప్రతిష్టాత్మక అవార్డులు ప్రకటించారు. ఎన్టీఆర్ నేషనల్ అవార్డును చిరంజీవికి అందించనున్నారు. పైడి జయరాజ్ అవార్డుకు కమల్ హాసన్ ఎంపికయ్యారు. సినారె అవార్డును సుద్దాల అశోక్ తేజకు ప్రకటించారు. అక్కినేని నాగేశ్వరరావు అవార్డును జయసుధకు ఇవ్వనున్నారు. నాగిరెడ్డి–చక్రపాణి అవార్డు అశ్వనీదత్కు దక్కగా, రఘుపతి వెంకయ్య అవార్డు రమేశ్ ప్రసాద్కు ప్రకటించారు. కాంతారావు అవార్డుకు ఆర్. నారాయణమూర్తి, బీఎన్ రెడ్డి అవార్డుకు సింగీతం శ్రీనివాసరావు ఎంపికయ్యారు.