POP BITES

Weekly Magazine

మార్చి 3న చంద్రగ్రహణం: తిరుమల శ్రీవారి ఆలయం తాత్కాలికంగా మూసివేత

మార్చి 3న చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. గ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:47 గంటలకు ముగియనుంది. సంప్రదాయం ప్రకారం గ్రహణానికి ఆరు గంటల ముందే ఆలయాన్ని మూసివేయనుండటంతో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు దర్శనాలు నిలిపివేస్తారు. అనంతరం ఆలయ శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించి రాత్రి 8:30 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.

Vol. 05 • Issue 05
Jan 24 - Jan 31, 2026

Contents

Featured Stories

మార్చి 3న చంద్రగ్రహణం: తిరుమల శ్రీవారి ఆలయం తాత్కాలికంగా మూసివేత 3
డికాక్ విధ్వంసం: వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా ఘన విజయం 4
నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’: తెలుగు, తమిళంలోనూ స్ట్రీమింగ్ 5
NH ప్రాజెక్టులకు డెడ్‌లైన్.. 2029 నాటికి ₹1.40 లక్షల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబు 6
మేడారం జాతరకు వరంగల్ జిల్లాలో స్కూళ్లకు సెలవు 7

Politics

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై PTI ఆందోళన 8
బారామతిలో విమానం కూలింది – ఎయిర్‌పోర్టులో విషాదం 9
మహారాష్ట్రకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ 10

Andhra

గ్రూప్‌-2 ఫలితాలు ఇంకా రాలేదు… అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది 11
విద్యుత్‌ శాఖలో ఉద్యోగ భర్తీ, నాణ్యమైన విద్యుత్‌ ప్రభుత్వ లక్ష్యం 12
మహారాష్ట్రకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ 13

Telangana

కవిత కొత్త రాజకీయ అడుగు… సొంత పార్టీకి రంగం సిద్ధం 14
మేడారం జాతరలో భక్తులకు విస్తృత వైద్య ఏర్పాట్లు 15
మహారాష్ట్రకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ 16

Sports

WPLలో బౌండరీల వర్షం – చివరి ఓవర్లో ఢిల్లీ చేజార్చుకున్న మ్యాచ్ 17
‘పాక్ నో అంటే.. మేం రెడీ’ – ఐస్‌ల్యాండ్ పంచ్ 18
డిమాండ్ నుంచి నిరాశకు… సంజూ శాంసన్ ఆటతీరుపై పెరుగుతున్న విమర్శలు 19

Movies

డార్లింగ్ ప్రభాస్-సందీప్ రెడ్డి ‘స్పిరిట్’కి OTT హక్కుల భారీ డిమాండ్ 20
ఓటీటీలోకి ‘ఛాంపియన్’: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం 21
నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’: తెలుగు, తమిళంలోనూ స్ట్రీమింగ్ 22

NRI

మోదీ ట్వీట్ తప్పుగా అనువదించబడింది 23

Weekly Statistics

This Week in Numbers 24

Politics

6 stories this week

NH ప్రాజెక్టులకు డెడ్‌లైన్.. 2029 నాటికి ₹1.40 లక్షల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబు

NH ప్రాజెక్టులకు డెడ్‌లైన్.. 2029 నాటికి ₹1.40 లక్షల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. మొత్తం ₹1.40 లక్షల కోట్ల విలువైన NH పనులను 2029 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓడరేవులు, ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానించేలా రోడ్డు నెట్‌వర్క్ అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న ₹42,194 కోట్ల పనులను 2027 డిసెంబర్ నాటికి పూర్తిచేయాలన్నారు. రాజధానిని కలుపుతూ BLR–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనులు 2027కల్లా ముగించాలని, ఖరగ్‌పూర్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు DPRలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు

మార్చి 31 నాటికి VJA బైపాస్ పూర్తి: కేంద్రమంత్రి గడ్కరీ

మార్చి 31 నాటికి VJA బైపాస్ పూర్తి: కేంద్రమంత్రి గడ్కరీ

గొల్లపూడి నుంచి చినకాకాని వరకు 17.88 కిలోమీటర్ల పొడవున చేపట్టిన విజయవాడ బైపాస్ ప్రాజెక్టు మార్చి 31 నాటికి పూర్తవుతుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. లోక్‌సభలో ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. మొత్తం ప్రాజెక్టులో 4 కిలోమీటర్ల మేర పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని, వాటిని నిర్ణీత గడువులో పూర్తి చేయడమే లక్ష్యమని తెలిపారు. 2019లో రూ.1,194 కోట్ల అంచనావ్యయంతో ఆరు వరసల బైపాస్‌కు అనుమతులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గనున్నాయి.

అజిత్ పవార్ అంత్యక్రియలు నేడు: బారామతిలో ప్రభుత్వ లాంఛనాలతో నివాళులు

అజిత్ పవార్ అంత్యక్రియలు నేడు: బారామతిలో ప్రభుత్వ లాంఛనాలతో నివాళులు

ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు నేడు ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. ఆయన సొంత నియోజకవర్గమైన బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, ఏపీ మంత్రి లోకేశ్ హాజరుకానున్నారు. నిన్న జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ సహా ఐదుగురు మృతి చెందారు.

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై PTI ఆందోళన

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై PTI ఆందోళన

అవినీతి ఆరోపణలతో మూడేళ్లుగా జైలులో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై PTI పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన తీవ్ర కంటి సమస్యతో బాధపడుతున్నారని, వెంటనే ఆస్పత్రిలో చికిత్స అందించకపోతే శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది. కోర్టు ఆదేశాలను జైలు సిబ్బంది పట్టించుకోవట్లేదని విమర్శిస్తూ, కుటుంబసభ్యులు, స్నేహితులను కలిసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేసింది. తక్షణ వైద్య పరీక్షలు నిర్వహించి మానవీయతతో వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరింది. న్యాయం, మానవ హక్కులు, మానవీయ విలువలు కాపాడాలని కూడా విజ్ఞప్తి చేసింది.

బారామతిలో విమానం కూలింది – ఎయిర్‌పోర్టులో విషాదం

బారామతిలో విమానం కూలింది – ఎయిర్‌పోర్టులో విషాదం

మహారాష్ట్రలోని బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ఒక విమానం నియంత్రణ తప్పినట్లు సమాచారం. రన్‌వే మీదుగా జారిపోతూ పక్కకు దూసుకెళ్లిన విమానం కూలిపోవడంతో అందులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్లైట్‌ను నియంత్రించడంలో పైలట్ పూర్తిగా విఫలమైనట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రమాదానికి గురైన Learjet 45 విమానాన్ని VSR సంస్థ నిర్వహిస్తోంది. ఈ విషాద ఘటనలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

మహారాష్ట్రకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

మహారాష్ట్రకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ కాసేపట్లో మహారాష్ట్రకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో అజిత్ పవార్ మృతికి మంత్రులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా అజిత్ పవార్‌తో తనకు ఉన్న పరిచయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఈ దుర్ఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Andhra

13 stories this week

మార్చి 3న చంద్రగ్రహణం: తిరుమల శ్రీవారి ఆలయం తాత్కాలికంగా మూసివేత

మార్చి 3న చంద్రగ్రహణం: తిరుమల శ్రీవారి ఆలయం తాత్కాలికంగా మూసివేత

మార్చి 3న చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. గ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:47 గంటలకు ముగియనుంది. సంప్రదాయం ప్రకారం గ్రహణానికి ఆరు గంటల ముందే ఆలయాన్ని మూసివేయనుండటంతో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు దర్శనాలు నిలిపివేస్తారు. అనంతరం ఆలయ శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించి రాత్రి 8:30 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.

NH ప్రాజెక్టులకు డెడ్‌లైన్.. 2029 నాటికి ₹1.40 లక్షల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబు

NH ప్రాజెక్టులకు డెడ్‌లైన్.. 2029 నాటికి ₹1.40 లక్షల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. మొత్తం ₹1.40 లక్షల కోట్ల విలువైన NH పనులను 2029 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓడరేవులు, ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానించేలా రోడ్డు నెట్‌వర్క్ అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న ₹42,194 కోట్ల పనులను 2027 డిసెంబర్ నాటికి పూర్తిచేయాలన్నారు. రాజధానిని కలుపుతూ BLR–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనులు 2027కల్లా ముగించాలని, ఖరగ్‌పూర్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు DPRలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు

బంగారం–వెండి ధరల షాక్: వాయిదా వేసినవారికి నిట్టూర్పు, పెట్టుబడులపై హడావిడి

బంగారం–వెండి ధరల షాక్: వాయిదా వేసినవారికి నిట్టూర్పు, పెట్టుబడులపై హడావిడి

బంగారం, వెండి ధరలు వరుసగా కొత్త రికార్డులు తాకుతూ పెట్టుబడిదారులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ‘ఇక పెరగవు’ అన్న అంచనాలు పదే పదే తప్పుతున్నాయి. కొనుగోలును వాయిదా వేసుకున్నవారు అవకాశాలు చేజారిపోయాయని భావిస్తున్నారు. ధరలు వేల రూపాయల వరకు ఎగబాకడంతో అప్పు తీసుకుని అయినా పెట్టుబడి పెట్టాలన్న చర్చ పెరుగుతోంది. ఇదే సమయంలో పుత్తడి మీద బ్యాంకు లోన్లు తీసుకునేవారి సంఖ్య కూడా ఇటీవల గణనీయంగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ కదలికలు, ద్రవ్యోల్బణ భయాలు ధరలకు మద్దతుగా నిలుస్తుండటంతో జాగ్రత్తతో, దీర్ఘకాల దృష్టితో నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అత్యుత్సాహం దూరంగా పెట్టాలని హెచ్చరిస్తున్నారు కూడా.

ఇవాళ గ్రూప్-1 ఫలితాలు విడుదలకు గ్రీన్‌సిగ్నల్

ఇవాళ గ్రూప్-1 ఫలితాలు విడుదలకు గ్రీన్‌సిగ్నల్

ఏపీ గ్రూప్-1 పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నట్లు సమాచారం. బుధవారం జరిగిన విచారణలో కోర్టు ఆదేశాలకు లోబడి ఫలితాలు ప్రకటించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. క్రీడా కోటకు సంబంధించిన కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, రిజర్వేషన్ రోస్టర్ కేసులో స్టే లేకపోవడంతో ఫలితాల విడుదలకు APPSC సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2023 డిసెంబర్‌లో 81 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా, 2024 మార్చిలో ప్రిలిమ్స్, 2025 మేలో మెయిన్స్, జూన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అభ్యర్థుల్లో ఫలితాలపై భారీ ఉత్కంఠ నెలకొంది.

మార్చి 3న తొలి చంద్రగ్రహణం: హోలీ పౌర్ణమికి ఖగోళ విశేషం

మార్చి 3న తొలి చంద్రగ్రహణం: హోలీ పౌర్ణమికి ఖగోళ విశేషం

2026 సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం మార్చి 3వ తేదీన సంభవించనుంది. హోలీ పౌర్ణమి రోజున జరిగే ఈ గ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.47 గంటలకు ముగుస్తుంది. సూర్యుడు, చంద్రుడి మధ్య భూమి రావడం వల్ల ఈ ఖగోళ అద్భుతం ఏర్పడుతుంది. గ్రహణ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. 2026లో మొత్తం రెండు గ్రహణాలు సంభవించనున్నాయని ఖగోళ నిపుణులు వెల్లడించారు. రెండో చంద్రగ్రహణం ఆగస్టు 28న ఏర్పడనుంది.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు రాజీనామా… గ్రూప్-2లో తాడిపత్రి దంపతుల డబుల్ విజయం

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు రాజీనామా… గ్రూప్-2లో తాడిపత్రి దంపతుల డబుల్ విజయం

తాజా ఏపీ గ్రూప్-2 ఫలితాల్లో అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన దంపతులు విశేషంగా రాణించారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న సమయంలో గ్రూప్-2 నోటిఫికేషన్ రావడంతో ఉద్యోగాలకు రాజీనామా చేసి కఠినంగా సిద్ధమయ్యారు. వారి కృషికి ఫలితం దక్కింది. భార్య వినీత సబ్ రిజిస్ట్రార్‌గా, భర్త హేమచంద్ర ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారు. ఇద్దరికీ ఒకేసారి ఉద్యోగాలు రావడంతో వారి కుటుంబంలో ఆనందం రెట్టింపైంది. ఈ ఫలితాల్లో మొత్తం 891 మంది గ్రూప్-2 ఉద్యోగాలు సాధించారు.

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు: జంతు కొవ్వు లేదని NDDB నివేదిక

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు: జంతు కొవ్వు లేదని NDDB నివేదిక

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ కీలక అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఆ నెయ్యిలో కొలెస్ట్రాల్ లేనట్లు NDDB నివేదికలో తేలిందని, దీంతో జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ అయినట్లు సమాచారం. అయితే పాలు లేదా వెన్నను ఉపయోగించకుండా రిఫైన్డ్ పామాయిల్, బీటా కెరోటిన్, ఫుడ్ గ్రేడ్ లాక్టిక్ యాసిడ్ వంటి రసాయనాలతో నెయ్యిలాంటి పదార్థాన్ని తయారు చేసినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి.

ఏకాదశి ఉపవాస విధానం: దశమి నుంచే ప్రారంభమయ్యే పవిత్ర నియమాలు

ఏకాదశి ఉపవాస విధానం: దశమి నుంచే ప్రారంభమయ్యే పవిత్ర నియమాలు

ఏకాదశి ఉపవాసం దశమి రోజే ప్రారంభమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దశమి రోజున మాంసాహారం త్యజించి, సాయంత్రం తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసి శ్రీమహావిష్ణువును భక్తితో పూజించాలి. వీలైనంతవరకు నిరాహారంగా ఉండటం ఉత్తమం. శక్తిలేని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. నిరాహారం సాధ్యంకాకపోతే మౌనవ్రతం పాటించడం శ్రేయస్కరం. ద్వాదశి రోజున తులసి తీర్థంతో ఉపవాసాన్ని విరమించాలి.

విద్యుత్‌ శాఖలో ఉద్యోగ భర్తీ, నాణ్యమైన విద్యుత్‌ ప్రభుత్వ లక్ష్యం

విద్యుత్‌ శాఖలో ఉద్యోగ భర్తీ, నాణ్యమైన విద్యుత్‌ ప్రభుత్వ లక్ష్యం

విద్యుత్‌ శాఖలో ఏఈ స్థాయి ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. రైతులు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం ప్రజలపై రూ.30 వేల కోట్ల భారం మోపిందని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఛార్జీలు పెంచకుండా, ఎన్నికల లోపు తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.

మహారాష్ట్రకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

మహారాష్ట్రకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ కాసేపట్లో మహారాష్ట్రకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో అజిత్ పవార్ మృతికి మంత్రులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా అజిత్ పవార్‌తో తనకు ఉన్న పరిచయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఈ దుర్ఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

ఆధార్ సేవల్లో విప్లవాత్మక మార్పులు: UIDAI కొత్త అప్‌డేట్

ఆధార్ సేవల్లో విప్లవాత్మక మార్పులు: UIDAI కొత్త అప్‌డేట్

UIDAI ఆధార్ సేవల్లో విప్లవాత్మక మార్పులు ప్రకటించింది. ఇకపై ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ఆధార్ యాప్ ద్వారా మొబైల్ నంబర్‌ను సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ‘డిజిటల్ ఐడెంటిటీ’ని ప్రోత్సహిస్తూ ప్రయాణాల్లో ఫిజికల్ ఆధార్ కాపీలు అవసరం లేకుండా వెరిఫికేషన్ చేయడం సాధ్యమైంది. ఈ మార్పులు ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్, ఆన్‌లైన్ లావాదేవీలకు కీలకంగా మారనున్నాయి. UIDAI ఈ కొత్త సదుపాయం ద్వారా ఆధార్ వినియోగాన్ని మరింత సురక్షితం, సౌకర్యవంతంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది.

NIT కాలికట్‌లో 50 అప్రెంటిస్ పోస్టుల భర్తీ

NIT కాలికట్‌లో 50 అప్రెంటిస్ పోస్టుల భర్తీ

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాలికట్ 50 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంపిక అకడమిక్ మెరిట్ ఆధారంగా జరుగుతుంది. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.15,000, డిప్లొమా ట్రైనీలకు రూ.12,500, ఐటీఐ అభ్యర్థులకు రూ.11,000 అందజేయబడతాయి. పూర్తి సమాచారం మరియు దరఖాస్తు కోసం వెబ్‌సైట్: https://nitc.ac.in/

గ్రూప్‌-2 ఫలితాలు ఇంకా రాలేదు… అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది

గ్రూప్‌-2 ఫలితాలు ఇంకా రాలేదు… అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది

గ్రూప్‌-2 ఫలితాల ప్రక్రియ ఇంకా నత్తనడకన కొనసాగుతోంది. 2023 డిసెంబరులో 905 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలై, ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయ్యాయి. అయినా తుది ఫలితాలు ఇంకా రాలేదు. కోర్టు కేసులు, రోస్టర్‌, స్పోర్ట్స్ కోటా అడ్డంకులుగా ఉన్నాయి. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా APPSC నిర్ణయం రాలేదు. అభ్యర్థులు ఫలితాలను వేగంగా ప్రకటించాలని నిరంతరం ఎదురుచూస్తున్నారు, ఈ ఎదురు చూడటంతో ఉత్కంఠ కొనసాగుతోంది.

Telangana

13 stories this week

మార్చి 3న చంద్రగ్రహణం: తిరుమల శ్రీవారి ఆలయం తాత్కాలికంగా మూసివేత

మార్చి 3న చంద్రగ్రహణం: తిరుమల శ్రీవారి ఆలయం తాత్కాలికంగా మూసివేత

మార్చి 3న చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. గ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:47 గంటలకు ముగియనుంది. సంప్రదాయం ప్రకారం గ్రహణానికి ఆరు గంటల ముందే ఆలయాన్ని మూసివేయనుండటంతో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు దర్శనాలు నిలిపివేస్తారు. అనంతరం ఆలయ శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించి రాత్రి 8:30 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.

మేడారం జాతరకు వరంగల్ జిల్లాలో స్కూళ్లకు సెలవు

మేడారం జాతరకు వరంగల్ జిల్లాలో స్కూళ్లకు సెలవు

మేడారం జాతర సందర్భంగా ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ఉంటుందని అధికారులు ప్రకటించారు. దీనికి బదులుగా ఫిబ్రవరి 14ను (రెండో శనివారం) పనిదినంగా పరిగణించనున్నట్లు తెలిపారు. ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు జాతరకు వెళ్లనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సెలవులు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కాగా మేడారం జాతర రేపటితో ముగియనుంది.

బంగారం–వెండి ధరల షాక్: వాయిదా వేసినవారికి నిట్టూర్పు, పెట్టుబడులపై హడావిడి

బంగారం–వెండి ధరల షాక్: వాయిదా వేసినవారికి నిట్టూర్పు, పెట్టుబడులపై హడావిడి

బంగారం, వెండి ధరలు వరుసగా కొత్త రికార్డులు తాకుతూ పెట్టుబడిదారులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ‘ఇక పెరగవు’ అన్న అంచనాలు పదే పదే తప్పుతున్నాయి. కొనుగోలును వాయిదా వేసుకున్నవారు అవకాశాలు చేజారిపోయాయని భావిస్తున్నారు. ధరలు వేల రూపాయల వరకు ఎగబాకడంతో అప్పు తీసుకుని అయినా పెట్టుబడి పెట్టాలన్న చర్చ పెరుగుతోంది. ఇదే సమయంలో పుత్తడి మీద బ్యాంకు లోన్లు తీసుకునేవారి సంఖ్య కూడా ఇటీవల గణనీయంగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ కదలికలు, ద్రవ్యోల్బణ భయాలు ధరలకు మద్దతుగా నిలుస్తుండటంతో జాగ్రత్తతో, దీర్ఘకాల దృష్టితో నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అత్యుత్సాహం దూరంగా పెట్టాలని హెచ్చరిస్తున్నారు కూడా.

ఇవాళ గ్రూప్-1 ఫలితాలు విడుదలకు గ్రీన్‌సిగ్నల్

ఇవాళ గ్రూప్-1 ఫలితాలు విడుదలకు గ్రీన్‌సిగ్నల్

ఏపీ గ్రూప్-1 పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నట్లు సమాచారం. బుధవారం జరిగిన విచారణలో కోర్టు ఆదేశాలకు లోబడి ఫలితాలు ప్రకటించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. క్రీడా కోటకు సంబంధించిన కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, రిజర్వేషన్ రోస్టర్ కేసులో స్టే లేకపోవడంతో ఫలితాల విడుదలకు APPSC సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2023 డిసెంబర్‌లో 81 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా, 2024 మార్చిలో ప్రిలిమ్స్, 2025 మేలో మెయిన్స్, జూన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అభ్యర్థుల్లో ఫలితాలపై భారీ ఉత్కంఠ నెలకొంది.

మార్చి 3న తొలి చంద్రగ్రహణం: హోలీ పౌర్ణమికి ఖగోళ విశేషం

మార్చి 3న తొలి చంద్రగ్రహణం: హోలీ పౌర్ణమికి ఖగోళ విశేషం

2026 సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం మార్చి 3వ తేదీన సంభవించనుంది. హోలీ పౌర్ణమి రోజున జరిగే ఈ గ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.47 గంటలకు ముగుస్తుంది. సూర్యుడు, చంద్రుడి మధ్య భూమి రావడం వల్ల ఈ ఖగోళ అద్భుతం ఏర్పడుతుంది. గ్రహణ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. 2026లో మొత్తం రెండు గ్రహణాలు సంభవించనున్నాయని ఖగోళ నిపుణులు వెల్లడించారు. రెండో చంద్రగ్రహణం ఆగస్టు 28న ఏర్పడనుంది.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు రాజీనామా… గ్రూప్-2లో తాడిపత్రి దంపతుల డబుల్ విజయం

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు రాజీనామా… గ్రూప్-2లో తాడిపత్రి దంపతుల డబుల్ విజయం

తాజా ఏపీ గ్రూప్-2 ఫలితాల్లో అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన దంపతులు విశేషంగా రాణించారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న సమయంలో గ్రూప్-2 నోటిఫికేషన్ రావడంతో ఉద్యోగాలకు రాజీనామా చేసి కఠినంగా సిద్ధమయ్యారు. వారి కృషికి ఫలితం దక్కింది. భార్య వినీత సబ్ రిజిస్ట్రార్‌గా, భర్త హేమచంద్ర ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారు. ఇద్దరికీ ఒకేసారి ఉద్యోగాలు రావడంతో వారి కుటుంబంలో ఆనందం రెట్టింపైంది. ఈ ఫలితాల్లో మొత్తం 891 మంది గ్రూప్-2 ఉద్యోగాలు సాధించారు.

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు: జంతు కొవ్వు లేదని NDDB నివేదిక

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు: జంతు కొవ్వు లేదని NDDB నివేదిక

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ కీలక అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఆ నెయ్యిలో కొలెస్ట్రాల్ లేనట్లు NDDB నివేదికలో తేలిందని, దీంతో జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ అయినట్లు సమాచారం. అయితే పాలు లేదా వెన్నను ఉపయోగించకుండా రిఫైన్డ్ పామాయిల్, బీటా కెరోటిన్, ఫుడ్ గ్రేడ్ లాక్టిక్ యాసిడ్ వంటి రసాయనాలతో నెయ్యిలాంటి పదార్థాన్ని తయారు చేసినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి.

ఏకాదశి ఉపవాస విధానం: దశమి నుంచే ప్రారంభమయ్యే పవిత్ర నియమాలు

ఏకాదశి ఉపవాస విధానం: దశమి నుంచే ప్రారంభమయ్యే పవిత్ర నియమాలు

ఏకాదశి ఉపవాసం దశమి రోజే ప్రారంభమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దశమి రోజున మాంసాహారం త్యజించి, సాయంత్రం తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసి శ్రీమహావిష్ణువును భక్తితో పూజించాలి. వీలైనంతవరకు నిరాహారంగా ఉండటం ఉత్తమం. శక్తిలేని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. నిరాహారం సాధ్యంకాకపోతే మౌనవ్రతం పాటించడం శ్రేయస్కరం. ద్వాదశి రోజున తులసి తీర్థంతో ఉపవాసాన్ని విరమించాలి.

మేడారం జాతరలో భక్తులకు విస్తృత వైద్య ఏర్పాట్లు

మేడారం జాతరలో భక్తులకు విస్తృత వైద్య ఏర్పాట్లు

మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా చికిత్స అందించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. మేడారంలో 50 పడకల ఆస్పత్రి, జాతర ప్రాంగణంలో 30 మెడికల్ క్యాంపులు, రూట్లలో 42 క్యాంపులు ఏర్పాటు చేశారు. 544 మంది డాక్టర్లు సహా 3,199 మంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచి, 38 అంబులెన్సులు, 40 బైక్ అంబులెన్సులను సిద్ధం చేశారు. భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందేలా ప్రత్యేక పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేశారు.

మహారాష్ట్రకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

మహారాష్ట్రకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ కాసేపట్లో మహారాష్ట్రకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో అజిత్ పవార్ మృతికి మంత్రులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా అజిత్ పవార్‌తో తనకు ఉన్న పరిచయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఈ దుర్ఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

ఆధార్ సేవల్లో విప్లవాత్మక మార్పులు: UIDAI కొత్త అప్‌డేట్

ఆధార్ సేవల్లో విప్లవాత్మక మార్పులు: UIDAI కొత్త అప్‌డేట్

UIDAI ఆధార్ సేవల్లో విప్లవాత్మక మార్పులు ప్రకటించింది. ఇకపై ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ఆధార్ యాప్ ద్వారా మొబైల్ నంబర్‌ను సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ‘డిజిటల్ ఐడెంటిటీ’ని ప్రోత్సహిస్తూ ప్రయాణాల్లో ఫిజికల్ ఆధార్ కాపీలు అవసరం లేకుండా వెరిఫికేషన్ చేయడం సాధ్యమైంది. ఈ మార్పులు ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్, ఆన్‌లైన్ లావాదేవీలకు కీలకంగా మారనున్నాయి. UIDAI ఈ కొత్త సదుపాయం ద్వారా ఆధార్ వినియోగాన్ని మరింత సురక్షితం, సౌకర్యవంతంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది.

NIT కాలికట్‌లో 50 అప్రెంటిస్ పోస్టుల భర్తీ

NIT కాలికట్‌లో 50 అప్రెంటిస్ పోస్టుల భర్తీ

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాలికట్ 50 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంపిక అకడమిక్ మెరిట్ ఆధారంగా జరుగుతుంది. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.15,000, డిప్లొమా ట్రైనీలకు రూ.12,500, ఐటీఐ అభ్యర్థులకు రూ.11,000 అందజేయబడతాయి. పూర్తి సమాచారం మరియు దరఖాస్తు కోసం వెబ్‌సైట్: https://nitc.ac.in/

కవిత కొత్త రాజకీయ అడుగు… సొంత పార్టీకి రంగం సిద్ధం

కవిత కొత్త రాజకీయ అడుగు… సొంత పార్టీకి రంగం సిద్ధం

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. సొంత పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన కవిత, ఇప్పుడు ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. పార్టీ పేరు, గుర్తుపై స్పష్టతకు వచ్చిన ఆమె, ‘తెలంగాణా ప్రజా జాగృతి’ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సెంటిమెంట్‌గా భావిస్తున్న ‘జాగృతి’ పేరును కొనసాగించాలని నిర్ణయించిన కవిత, ఉగాది నాటికి పార్టీ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Sports

5 stories this week

డికాక్ విధ్వంసం: వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా ఘన విజయం

డికాక్ విధ్వంసం: వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా ఘన విజయం

సెంచూరియన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుత సెంచరీతో జట్టుకు ఘన విజయం అందించాడు. కేవలం 43 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన డికాక్, 10 సిక్సులు, 6 ఫోర్లతో బౌలర్లను ఊచకోత కోశాడు. 49 బంతుల్లో 115 పరుగులు చేసిన డికాక్‌కు రికెల్టన్ (36 బంతుల్లో 77*) చక్కని సహకారం అందించాడు. 222 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 17.3 ఓవర్లలోనే ఛేదించింది. వెస్టిండీస్ తరఫున హెట్‌మయర్, రూథర్‌ఫర్డ్ రాణించారు.

మళ్లీ యాక్టివ్ అయిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టా అకౌంట్… ఫ్యాన్స్ జోష్

మళ్లీ యాక్టివ్ అయిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టా అకౌంట్… ఫ్యాన్స్ జోష్

విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మళ్లీ యాక్టివేట్ కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘అన్న వచ్చేశాడోచ్’ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. నిన్న రాత్రి నుంచి కోహ్లీ ఇన్‌స్టా అకౌంట్ కనిపించకపోవడంతో ‘యూజర్ నాట్ ఫౌండ్’ అని చూపించడమే ఫ్యాన్స్‌లో ఆందోళన కలిగించింది. ఇది టెక్నికల్ గ్లిచ్ వల్ల జరిగిందా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ అంశంపై ఇప్పటివరకు విరాట్ కోహ్లీ లేదా ఇన్‌స్టాగ్రామ్ అధికారికంగా స్పందించలేదు.

డిమాండ్ నుంచి నిరాశకు… సంజూ శాంసన్ ఆటతీరుపై పెరుగుతున్న విమర్శలు

డిమాండ్ నుంచి నిరాశకు… సంజూ శాంసన్ ఆటతీరుపై పెరుగుతున్న విమర్శలు

ఇటీవల వరకు సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేసిన అభిమానులే ఇప్పుడు అతడి ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరుసగా అవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఫుట్‌వర్క్ బలహీనంగా ఉందని, వికెట్లను వదిలేసి క్లీన్ బౌల్డ్ అవుతున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం 40 పరుగులే చేయడంతో విమర్శలు మరింత పెరిగాయి.

WPLలో బౌండరీల వర్షం – చివరి ఓవర్లో ఢిల్లీ చేజార్చుకున్న మ్యాచ్

WPLలో బౌండరీల వర్షం – చివరి ఓవర్లో ఢిల్లీ చేజార్చుకున్న మ్యాచ్

IPL తరహాలో WPLలో బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపించారు. గుజరాత్‌తో మ్యాచులో ఢిల్లీ బ్యాటర్లు నికీ ప్రసాద్, స్నేహ్ రాణా చెలరేగారు. 17వ ఓవర్లో నికీ వరుస ఫోర్లు, చివరి బంతికి రాణా సిక్సర్ మ్యాచ్‌కు ఊపు తెచ్చాయి. 19వ ఓవర్లో రాణా భారీ షాట్లు, నికీ ఫోర్ ఉత్కంఠ పెంచాయి. కానీ చివరి ఓవర్లో తడబడి ఢిల్లీ చేతిలో ఉన్న మ్యాచ్‌ను చేజార్చుకుంది.

‘పాక్ నో అంటే.. మేం రెడీ’ –  ఐస్‌ల్యాండ్ పంచ్

‘పాక్ నో అంటే.. మేం రెడీ’ – ఐస్‌ల్యాండ్ పంచ్

T20 వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్ చేస్తామని పాకిస్థాన్ బెదిరింపులకు దిగుతుండటంతో ఐస్‌ల్యాండ్ క్రికెట్ బోర్డు సరదాగా ట్రోల్ చేసింది. పాక్ స్థానంలో తామే టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. ‘వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ ఆడుతుందో లేదో త్వరగా స్పష్టం చేస్తే మంచిది. ఫిబ్రవరి 2న వారు వైదొలిగితే మేము వెంటనే బయలుదేరేందుకు రెడీ. ఫిబ్రవరి 7 నాటికి కొలంబో చేరుకోవడం కష్టమవుతుంది’ అంటూ ఐస్‌ల్యాండ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.

Movies

5 stories this week

నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’: తెలుగు, తమిళంలోనూ స్ట్రీమింగ్

నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’: తెలుగు, తమిళంలోనూ స్ట్రీమింగ్

సూపర్ హిట్ మూవీ ‘ధురంధర్’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో హిందీలో మాత్రమే విడుదలైన ఈ చిత్రం, OTTలో తెలుగు మరియు తమిళ భాషల్లోనూ ప్రేక్షకులను అలరిస్తోంది. థియేట్రికల్ వెర్షన్ 3 గంటలు 34 నిమిషాల రన్‌టైమ్ ఉండగా, OTT కోసం దీన్ని 3 గంటలు 25 నిమిషాలకు కట్ చేశారు. 2025 డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹1350 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందులో రణ్‌వీర్ సింగ్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటించారు. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా ఇది రికార్డు సృష్టించింది.

చిరంజీవి–బాబీ కాంబో మూవీకి లాంచ్ రెడీ

చిరంజీవి–బాబీ కాంబో మూవీకి లాంచ్ రెడీ

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించబోయే సినిమాను వచ్చే నెలలో లాంచ్ చేయనున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీలో బాలీవుడ్ డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. మాస్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుండగా, చిరంజీవి కూతురిగా కృతి శెట్టి లేదా అనస్వర రాజన్ నటిస్తారని టాక్. చిరు–బాబీ కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

క్యాస్టింగ్ కౌచ్‌పై చర్చ: చిన్మయి వ్యాఖ్యలకు తమ్మారెడ్డి భరద్వాజ మద్దతు

క్యాస్టింగ్ కౌచ్‌పై చర్చ: చిన్మయి వ్యాఖ్యలకు తమ్మారెడ్డి భరద్వాజ మద్దతు

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి విభేదించగా, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. చిన్మయి చెప్పింది నిజమేనని ఆయన వ్యాఖ్యానించారు. పరిశ్రమలో ఒకరిద్దరు పెద్దల్లో లైంగిక వాంఛలు తీర్చుకోవాలనే ధోరణి ఉందని, అయితే అందరూ వేధింపులకు పాల్పడటం లేదని స్పష్టం చేశారు. ఏడాదికి సుమారు 250 సినిమాలు నిర్మితమవుతుంటే, 30–40 చిత్రాలు మహిళలను వాడుకునే ధోరణితోనే తీస్తున్నవని అన్నారు. ఇది కాదనలేని వాస్తవమని పేర్కొన్నారు.

ఓటీటీలోకి ‘ఛాంపియన్’: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం

ఓటీటీలోకి ‘ఛాంపియన్’: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం

రోషన్ హీరోగా, అనస్వర–అవంతిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఛాంపియన్’ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. గత నెల 25న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. స్పప్న దత్ నిర్మాణంలో ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు మంచి స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో సంచలనంగా మారిన ‘గిర గిర గింగిరాగిరే’ పాట ఈ చిత్రానిదే.

డార్లింగ్ ప్రభాస్-సందీప్ రెడ్డి ‘స్పిరిట్’కి OTT హక్కుల భారీ డిమాండ్

డార్లింగ్ ప్రభాస్-సందీప్ రెడ్డి ‘స్పిరిట్’కి OTT హక్కుల భారీ డిమాండ్

డార్లింగ్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో రూపొందుతున్న ‘స్పిరిట్’ సినిమా ప్రారంభకంగా నుండే భారీ డిమాండ్‌ను సొంతం చేసుకుంది. చిత్రీకరణ ఇంకా పూర్తవకముందే OTT హక్కులను ‘నెట్‌ఫ్లిక్స్’ అధిక ధరకు కొనుగోలు చేసింది. ఆసక్తికరంగా, హీరో, దర్శకుల రెమ్యునరేషన్ కాకుండా OTT రైట్స్ ద్వారా సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రం యొక్క రెండవ షెడ్యూల్ ఫిబ్రవరి 15 నుండి తిరిగి ప్రారంభమవుతుందని చిత్రవర్గాలు తెలిపారు.

NRI

1 stories this week

మోదీ ట్వీట్ తప్పుగా అనువదించబడింది

మోదీ ట్వీట్ తప్పుగా అనువదించబడింది

మాల్దీవ్స్‌కు ధన్యవాదాలు చెబుతూ PM మోదీ చేసిన ట్వీట్ తప్పుగా అనువదించబడింది. అనువాదంలో ‘రిపబ్లిక్ డే వేడుకలు మాల్దీవ్స్‌లో జరిగాయి’ మరియు ‘భారత వ్యతిరేక ప్రచారాల్లో మాల్దీవ్స్ ముందున్నారు’ అని చెప్పబడింది. నిజానికి, మోదీ రెండు దేశాల ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని, మాల్దీవుల ప్రజలకు శ్రేయస్సు, ఆనందంతో నిండిన భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.

This Week in Numbers

Weekly Statistics & Insights

31
Total Articles
31
Featured Stories
6
Categories Covered
7
Days of Coverage