సీషెల్స్ అధ్యక్షుడితో మోదీ కీలక చర్చలు.. ద్వైపాక్షిక బంధాల బలోపేతం
📅 28-06-2026
ప్రధాని నరేంద్ర మోదీ సీషెల్స్ అధికారిక పర్యటనలో భాగంగా అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో ప్రతినిధి స్థాయి చర్చలు నిర్వహించారు. స్టేట్ హౌస్లో జరిగిన ఈ సమావేశంలో సముద్ర భద్రత, వ్యూహాత్మక భాగస్వామ్యం, అభివృద్ధి సహకారం వంటి అంశాలపై చర్చించారు. అంతకుముందు మోదీకి గౌరవ వందనం నిర్వహించారు. శనివారం సీషెల్స్కు చేరుకున్న ప్రధాని, భారత్ నిర్మించిన ఫాస్ట్ పట్రోల్ వెసెల్తో పాటు అంబులెన్స్లు, యుటిలిటీ వాహనాలు, లేజర్ గైడెడ్ బోట్లు సీషెల్స్కు అందజేశారు. సోమవారం జరిగే స్వాతంత్ర్య స్వర్ణోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు