కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాను కడప బైపాస్తో అనుసంధానించే రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు రూ.304.44 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీనిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతికి కేంద్రం అందిస్తున్న సహకారం అభినందనీయమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కొప్పర్తి-కడప బైపాస్ కనెక్టివిటీ రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారుతుందని తెలిపారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో కొప్పర్తి ముఖ్యమైన ప్రాంతంగా ఉందని పేర్కొన్నారు.
కొత్త రహదారి అందుబాటులోకి వస్తే కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాకు రాకపోకలు సులభతరం అవుతాయని, పారిశ్రామిక సరకు రవాణా మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడటంతో పాటు వాణిజ్య కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
కొప్పర్తి-కడప బైపాస్ రహదారికి రూ.304.44 కోట్లు.. కేంద్రానికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు
3
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk