కరీంనగర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన వరుస ఏటీఎం చోరీలు కలకలం రేపాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన రెండు ఏటీఎంలను దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. దురిషేడ్లో తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో స్కార్పియో వాహనంలో ముగ్గురు దుండగులు వచ్చినట్లు కథనంలో పేర్కొన్నారు. ఏటీఎంలోకి ప్రవేశించిన వారు ముందుగా అక్కడి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం గ్యాస్ కట్టర్ సాయంతో క్యాష్ మిషన్ను కట్ చేసి అందులోని నగదును దోచుకుని అదే వాహనంలో పరారయ్యారు.
ఇదే సమయంలో తిమ్మాపూర్లోని మరో ఎస్బీఐ ఏటీఎంలో కూడా చోరీ జరిగింది. ఈ ఘటనలో దుండగులు లేడీ గెటప్లో ఏటీఎంలోకి ప్రవేశించినట్లు సమాచారం. తమ కదలికలు స్పష్టంగా రికార్డు కాకుండా ఉండేందుకు సీసీటీవీ కెమెరాలపై స్ప్రే చేసి అనంతరం చోరీకి పాల్పడ్డారు.
రెండు ప్రాంతాల్లోనూ ఏటీఎంలను లక్ష్యంగా చేసుకోవడం, సీసీటీవీ వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించడం పోలీసుల దృష్టిని ఆకర్షించింది. ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు స్థానిక సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దుండగులు ఉపయోగించిన వాహనం, ఘటనలకు ముందు మరియు తర్వాత వారి కదలికలను పరిశీలిస్తున్నారు. రెండు చోరీల వెనుక ఒకే ముఠా ఉందా లేదా వేర్వేరు ముఠాల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.
కరీంనగర్లో రెండు ఎస్బీఐ ఏటీఎంలపై దొంగల దాడి.. లేడీ గెటప్లో చోరీ
7
Published: 📅
Reported by: 🖊
Venkata Dodla