అఫ్గానిస్థాన్తో జరగనున్న టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకుని అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావాలని భావిస్తున్న స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య మళ్లీ గాయపడినట్లు సమాచారం.
తొడ కండరాల గాయంతో కొంతకాలంగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో హార్దిక్ పునరావాసం పొందుతున్నాడు. ఇటీవలే అతడు ఫిట్నెస్ సాధించాడని, జట్టులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా శిక్షణ సమయంలో అతడి కాలికి గాయం కావడంతో అఫ్గానిస్థాన్తో జరగనున్న మూడు టీ20ల సిరీస్లో అతడి రీఎంట్రీపై అనుమానాలు నెలకొన్నాయి.
టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ చివరిసారిగా టీమిండియా తరఫున ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్తో పాటు ఐర్లాండ్, ఇంగ్లండ్ వైట్బాల్ సిరీస్లు, జింబాబ్వే టీ20 సిరీస్లకు దూరమయ్యాడు.
హార్దిక్తో పాటు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ గాయాల నుంచి కోలుకుంటున్నారని సమాచారం. మరోవైపు జస్ప్రీత్ బుమ్రాకు కూడా ఇంకా అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావడానికి క్లియరెన్స్ రాలేదు. రాబోయే వన్డే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్ల ఫిట్నెస్పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెడుతోంది.
అఫ్గాన్ సిరీస్కు ముందు టీమిండియాకు షాక్.. మళ్లీ గాయపడిన హార్దిక్ పాండ్య
3