సీనియర్ యాక్టర్ జగపతిబాబు హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్మురా' విజయవంతంగా కొనసాగుతోంది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోకి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే అక్కినేని నాగార్జున, నాని వంటి హీరోలు గెస్టులుగా పాల్గొనగా.. రాబోయే ఎపిసోడ్ లో త్వరలో ముగ్గురు సీనియర్ నటీమణులు సందడి చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. 'అందమైన వయ్యారి భామలతో జగపతిబాబు ముచ్చట్లు' అంటూ షేర్ చేసిన ఈ వీడియో అలరిస్తోంది.
Jayammu Nischayammu Raa Promo: అన్ని బట్టలు వేసుకోకూడదు కదా.. మీనా, సిమ్రాన్లతో జగపతిబాబు బోల్డ్ టాక్..
6
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan