ప్యారిస్ నగరంలోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్ వద్ద ఫ్రాన్స్ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, విదేశాల్లో పార్టీ బలోపేతం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సమావేశంలో చర్చించారు. ప్రవాసాంధ్రుల సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధిలో NRIల పాత్రను పెంచాలని నిర్ణయించారు.
ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం వేలాది మంది అభ్యర్థులు కష్టపడి చదివి, పోటీ పరీక్షల్లో విజయం సాధించారని మహేశ్ గనుపూరు పేర్కొన్నారు.
ఎంపికైన అభ్యర్థులపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం, నియామకాలపై తప్పుడు ప్రచారం చేయడం వల్ల వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని అన్నారు. ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల కష్టాన్ని గౌరవించాలని సూచించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక ఘట్టమని మహేశ్ గనుపూరు పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర నుంచి యూరప్, అమెరికా, మధ్యప్రాచ్య దేశాలకు నేరుగా విమాన సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం, ఖర్చు తగ్గడంతో పాటు వాణిజ్య సంబంధాలు మరింత బలపడతాయని తెలిపారు.
భోగాపురం నుంచి ప్యారిస్తో పాటు ఇతర యూరప్ దేశాలకు విమాన సర్వీసుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ చొరవ తీసుకోవాలని కోరారు.
ప్రవాసాంధ్రులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సమావేశంలో నాయకులు పిలుపునిచ్చారు. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధి అవకాశాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో పలువురు ఫ్రాన్స్ TDP నాయకులు పాల్గొన్నారు.
ప్యారిస్లో ఫ్రాన్స్ TDP సమన్వయ కమిటీ భేటీ.. ఏపీ అభివృద్ధి, NRIల పాత్రపై చర్చ
9
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan