సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ఏఐకి చెందిన గ్రోక్ చాట్బాట్పై అమెరికాలో న్యాయపరమైన వివాదం మొదలైంది. గ్రోక్ సహాయంతో అభ్యంతరకరమైన కంటెంట్ను రూపొందించేందుకు బాలల లైంగిక వేధింపులకు గురైన ఓ బాధితురాలి పాత ఫొటోలను ఉపయోగించారని ఓ అమెరికన్ మహిళ ఆరోపించారు. ఈ కంటెంట్ను ఎక్స్ వేదికగా షేర్ చేశారని పేర్కొంటూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు.
ఫిర్యాదు ప్రకారం, బాధితురాలికి సంబంధించిన చిత్రాలు గ్రోక్ ద్వారా అభ్యంతరకర రీతిలో మార్చబడ్డాయని, ఈ విషయాన్ని కెనడియన్ సెంటర్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్ కూడా గుర్తించిందని పేర్కొన్నారు. ఈ కేసులో జ్యూరీ విచారణ జరపాలని మహిళ కోరారు.
గతంలో లైంగిక వేధింపుల నుంచి బయటపడిన ఆ మహిళను 2000 సంవత్సరం ప్రారంభంలో గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెకు సంబంధించిన చిత్రాలు చాలా సంవత్సరాలుగా ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయని తెలిపారు. అయితే గ్రోక్ ద్వారా ఇలాంటి అభ్యంతరకర చిత్రాల సృష్టి ఇటీవల పెరిగిందని ఆరోపించారు. జనవరి 8తో ముగిసిన 11 రోజుల్లో గ్రోక్ ద్వారా 30 లక్షలకు పైగా ఇలాంటి కంటెంట్ రూపొందించారని, వాటిలో వేలాది చిత్రాలు పిల్లలను పోలి ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
వివాదం తర్వాత ఎక్స్ ఏఐ కంటెంట్ క్రియేషన్ సదుపాయాన్ని పరిమితం చేసిందని సమాచారం. ఈ ఆరోపణలపై సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
11 రోజుల్లో 30 లక్షల అభ్యంతరకర కంటెంట్.. గ్రోక్పై కేసు నమోదు
8
Published: 📅
Reported by: 🖊
Sarika Sk