అమరావతి: 2027 జనవరి 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంజీవని సేవలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం అమరావతిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సంజీవని ప్రాజెక్ట్ పురోగతిపై ఆయన చర్చించారు.
కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో ఇప్పటికే అమలు చేసిన సంజీవని సేవల ఫలితాలను పరిశీలించి, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు తెలిపారు.
ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించి వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, శాఖ కార్యదర్శి వీర పాండ్యన్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంజీవని సేవల ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని సేవలు.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
5
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk