Visakhapatnam Tirupati Vande Bharat Express New Train: ఆంధ్రప్రదేశ్ నుండి కొత్త వందేభారత్ రైలును నడపాలని ప్రతిపాదన వచ్చింది. ఈ మేరకు కేంద్రాన్ని కోరినట్లు ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. విశాఖపట్నం-బెంగళూరు, విశాఖపట్నం-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్లను నడపాలని ప్రతిపాదించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, విశాఖపట్నం రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభమవుతాయి అన్నారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు.
ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ రైలు.. ఈ రూట్లో ప్రతిపాదన, తిరుమల వెళ్లే భక్తులకు పండగే
4
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan
📍 ఆంధ్రప్రదేశ్