గ్రామీణ ఉపాధి రంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) పథకం గురువారం ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ముక్కవారిపల్లె నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
2006 నుంచి అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (MGNREGS) బదులుగా ఈ కొత్త పథకం అమల్లోకి వచ్చింది. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి అవకాశాలను మరింత విస్తరించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి, జీవనోపాధి, నీటి సంరక్షణ, వాతావరణ మార్పులకు అనుగుణమైన పనులకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
కొత్త పథకం కింద ఉపాధి హామీ 100 రోజుల నుంచి 125 రోజులకు పెరగడం, వేతనాలను వారానికోసారి చెల్లించడం, దరఖాస్తు చేసిన 15 రోజుల్లో పని ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి జమ చేయడం, వేతనాల చెల్లింపులో ఆలస్యం జరిగితే పరిహారం ఇవ్వడం వంటి నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. గ్రామీణ ఉపాధి వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు డిజిటల్ పోర్టల్ను కూడా ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 వేల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి కార్యక్రమాల ద్వారా సాధించిన విజయాలను ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శనను కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు.
గ్రామీణ ఉపాధికి కొత్త దిశ.. నేడు వికసిత్ భారత్ గ్యారంటీ పథకం ప్రారంభం
1
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan