కేంద్ర బడ్జెట్ ఏపీ ప్రగతికి ఉపయోగపడేలా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పర్యాటక రంగానికి ఇచ్చిన ప్రోత్సాహకాలు అరకు అభివృద్ధికి తోడ్పడతాయని చెప్పారు. ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా తీర ప్రాంతాల్లో పరిశ్రమలకు ఊపొస్తుందని పేర్కొన్నారు. కొబ్బరి, జీడిపప్పు, కోకో రైతుల కోసం బడ్జెట్లో తీసుకున్న చర్యలతో కోనసీమ, ఉత్తరాంధ్ర రైతులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.