మెగా డీఎస్సీపై జగన్ విమర్శలకు లోకేశ్ కౌంటర్.. త్వరలో కొత్త నోటిఫికేషన్
📅 11-09-2026
మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన విమర్శలకు ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీపై విష ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు. త్వరలోనే కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో టీచర్ పోస్టుల భర్తీపై లోకేశ్ విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీపైనే చేశారని, 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు.