ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్తో సీఎం రేవంత్ భేటీ.. మూసీపై కీలక చర్చలు
📅 15-09-2026
హైదరాబాద్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అగా ఖాన్ ఫౌండేషన్ వారసత్వ సంపద పునరుద్ధరణలో కీలక పాత్ర పోషిస్తోందని సీఎం ప్రశంసించారు. మూసీ నది పునరుజ్జీవం కోసం సిద్ధం చేస్తున్న ప్రణాళికలపై చర్చించారు. మూసీ పరివాహక ప్రాంతంలోని సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణకు అగా ఖాన్ ఫౌండేషన్ సహకారం కోరారు. ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని వారసత్వ సంపదగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.