lokesh attends t20 wc final in ahmedabad

అహ్మదాబాద్ ఫైనల్లో లోకేశ్ సందడి

2

Published on: 📅 09 Mar 2026, 10:12 AM
Reporter: 🖊 Kiran Rao

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఏపీ మంత్రి నారా లోకేశ్ సందడి చేశారు. క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, వెంకటేశ్ ప్రసాద్‌లతో కలిసి ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. టీ20 ప్రపంచకప్‌ను అద్భుతంగా నిర్వహించినందుకు ఐసీసీ ఛైర్మన్ జై షాను ఆయన అభినందించారు. అభిమానులతో కలిసి మ్యాచ్‌ను ఆస్వాదించినట్లు తెలిపారు.

Sponsored