పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్లో క్రికెట్ ఆటలో జరిగిన చిన్నపాటి వాగ్వాదం విషాదాంతమైంది. 15 ఏళ్ల నిశాంత్ అనే బాలుడు ముగ్గురు బాలుర దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఆట సమయంలో మొదలైన తగవు తర్వాత 12 ఏళ్ల బాలుడు తన బంధువులతో కలిసి వచ్చి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. గొడవలో నిశాంత్ మెడ, తలకు గాయాలై అపస్మారక స్థితికి చేరాడు. ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతిగా ప్రకటించారు. కేసు నమోదు చేసి ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకున్నారు. ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
క్రికెట్ వివాదం ఘోరాంతం… ఢిల్లీలో 15 ఏళ్ల బాలుడు మృతి
8
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan
📍 ఢిల్లీ