నంద్యాలకు చెందిన మేకల శేషాచలం అనుమానాస్పద మృతి కలకలం రేపింది. భార్య రమణ పిలవడంతో అత్తింటికి వెళ్లిన శేషాచలం శవమై కనిపించాడు. భార్య, బావమరిది కారులో శవాన్ని తీసుకొచ్చి అప్పగించడంతో అనుమానాలు మొదలయ్యాయి. కూతురు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యే భర్తను చంపి డోర్ డెలివరీ చేసిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై రమణ ఎలా స్పందిస్తారన్నది చూడాలి.
భర్తను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసిన భార్య?.. సంచలనంగా మారిన కేసు!
2
Published on: 📅 01 Apr 2026, 06:32 PM
Reporter: 🖊