రాజస్థాన్లో గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో హైవేపై ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కిషన్గఢ్ టోల్ప్లాజా సమీపంలో లారీ టైరు పేలడంతో అదుపుతప్పి పడిపోయింది. దాదాపు 145 గ్యాస్ సిలిండర్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో కొంతసేపు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చేరుకొని సిలిండర్లను మరో వాహనంలోకి మార్చి రహదారిని క్లియర్ చేశారు.
హైవేపై గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా.. క్షణాల్లో గందరగోళం
6
Published on: 📅 14 Mar 2026, 05:15 PM
Reporter: 🖊 Anitha Sharma