దేశ భద్రతకు ముప్పుగా మారుతున్న ఆన్లైన్ ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రతా సంస్థల కట్టుదిట్టమైన నిఘా కొనసాగుతోంది. ఈ నిషేధిత ఉగ్రవాద సంస్థ ISISతో సంబంధాలు ఉన్న యువకుడిని ఉత్తరప్రదేశ్లోని ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) అదుపులోకి తీసుకుంది. అరెస్టయిన నిందితుడిని 19 ఏళ్ల డెంటల్ విద్యార్థి హరీష్ అలీగా పేర్కొన్నారు.
అధికారుల సమాచారం ప్రకారం, భారత్లో ఐసిస్కు అనుబంధంగా పనిచేస్తున్న ఆన్లైన్ నెట్వర్క్లపై నిఘా కొనసాగుతున్న సమయంలో హారిష్ కార్యకలాపాలు బయటపడ్డాయి. సహారన్పూర్ జిల్లాకు చెందిన ఈ విద్యార్థి సోషల్ మీడియా ద్వారా ఐసిస్ హ్యాండ్లర్లు మరియు మద్దతుదారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు గుర్తించారు.
బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న హారిష్, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్లను ఉపయోగించి ఉగ్ర భావజాలం కలిగిన వ్యక్తులను ఆకర్షించేందుకు పలు ఆన్లైన్ గ్రూపులను సృష్టించినట్లు విచారణలో తేలింది. ప్రత్యేకంగా ఐసిస్ ప్రచారం కోసం గ్రూప్ను నడిపినట్లు అధికారులు తెలిపారు.
భారత్తో పాటు విదేశాల్లోని ఐసిస్ అనుచరులతో కూడా అతనికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, అతని కార్యకలాపాలపై లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో దేశంలో సైబర్ ఉగ్రవాదంపై మరోసారి అప్రమత్తత అవసరం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఐసిస్ లింకులు.. యూపీలో డెంటల్ విద్యార్థి అరెస్ట్
11
Published on: 📅 18 Mar 2026, 12:16 PM
Reporter: 🖊 Ramesh Kumar