ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్ 30 ఉదయం 11 గంటలకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఫలితాలను అధికారికంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షలు రాసిన విద్యార్థులు ఇప్పుడు తమ హాల్ టికెట్ నంబర్తో ఆన్లైన్లో మార్కుల మెమోను చూసుకోవచ్చు. అధికారిక ఫలితాల పోర్టల్లో ఫలితాల లింక్ యాక్టివ్గా ఉంది.
విద్యార్థులు ముందుగా results.bse.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ ఏపీ ఎస్ఎస్సీ ఫలితాల లింక్పై క్లిక్ చేసి హాల్ టికెట్ నంబర్ నమోదు చేయాలి. తర్వాత సబ్మిట్ చేస్తే సబ్జెక్టుల వారీ మార్కులు, గ్రేడ్ వివరాలు కనిపిస్తాయి. కనిపించిన మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఈ ఆన్లైన్ మెమో తాత్కాలికమైనది మాత్రమే. అసలు ధ్రువపత్రం తర్వాత పాఠశాల ద్వారా అందుతుంది.
ఫలితాలు చూడడానికి అధికారిక వెబ్సైట్లు ఇవి: results.bse.ap.gov.in ,bse.ap.gov.in
అధికారిక వెబ్సైట్ నెమ్మదిగా పనిచేస్తే డిజిలాకర్, లీప్ మొబైల్ యాప్, మన మిత్ర వాట్సాప్ సేవలను ఉపయోగించవచ్చు. మన మిత్ర వాట్సాప్ ద్వారా ఫలితం తెలుసుకోవాలంటే 9552300009 నంబర్కు Hi అని పంపాలి. తర్వాత ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఎంపిక చేసి హాల్ టికెట్ నంబర్ నమోదు చేస్తే ఫలితాలు కనిపిస్తాయి. ఈ ఏడాది ఏపీ పదో తరగతి ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 85.25గా నమోదైంది. బాలికలు 87.90 శాతం, బాలురు 82.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది 81.14 శాతంగా ఉన్న ఉత్తీర్ణత ఈసారి మెరుగుపడింది.
ఫలితాల రోజున ఒకేసారి ఎక్కువ మంది వెబ్సైట్ ఓపెన్ చేయడం వల్ల సైట్ నెమ్మదిగా పనిచేయవచ్చు. కాబట్టి విద్యార్థులు ఆందోళన చెందకుండా మరోసారి ప్రయత్నించాలి. హాల్ టికెట్ నంబర్ను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. మార్కులు చూసిన తర్వాత ఇంటర్మీడియట్ గ్రూప్ ఎంపికను తొందరగా కాకుండా ఆలోచించి నిర్ణయించుకోవాలి. పదో తరగతి ఫలితం ఒక ముఖ్యమైన దశ మాత్రమే, భవిష్యత్తుకు అంతిమ తీర్పు కాదు.
ఏపీ పదో ఫలితాలు విడుదల....విద్యార్థులు ఇక్కడే చెక్ చేసుకోవచ్చు
5
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan