ఏఐ వినియోగంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయవాదుల పనిని సులభతరం చేయడంలో, సమయాన్ని ఆదా చేయడంలో ఏఐ ఉపయోగపడుతుందని అన్నారు. అయితే న్యాయవాది శిక్షణ పొందిన మనస్సును, కోర్టు అధికారి నైతిక బాధ్యతను లేదా జడ్జి తీర్పును ఇది భర్తీ చేయలేదని స్పష్టం చేశారు. డ్రాఫ్ట్ నోట్స్ తయారు చేయడంలో టెక్నాలజీ సహాయపడుతుందని, కానీ చట్టాలను రూపొందించేందుకు అనుమతించలేమని జస్టిస్ విక్రమ్ నాథ్ పేర్కొన్నారు.
ఏఐపై జస్టిస్ విక్రమ్ నాథ్ వ్యాఖ్యలు.. న్యాయవాదులను భర్తీ చేయలేడు
4
Published on: 📅 14 Mar 2026, 03:32 PM
Reporter: 🖊 Anitha Sharma