ఈసారి ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్, రన్నరప్ తలపడబోరని క్రిక్బజ్ తెలిపింది. బెంగళూరు, పంజాబ్ జట్లు వేర్వేరు మ్యాచ్లతో టోర్నీని ప్రారంభించనున్నట్లు పేర్కొంది. సంప్రదాయం ప్రకారం హై ప్రొఫైల్ మ్యాచ్తో సీజన్ ప్రారంభిస్తారు. ఈసారి మార్చి 28న బెంగళూరు–చెన్నై మధ్య తొలి మ్యాచ్ జరిగే అవకాశం ఉందని సమాచారం. రన్నరప్ పంజాబ్ మార్చి 29న గుజరాత్ టైటాన్స్తో తలపడవచ్చని తెలుస్తోంది. కాగా మార్చి 12 లేదా 13న అధికారిక ఐపీఎల్ షెడ్యూల్ విడుదల కానుంది.