ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో రూ. 590 కోట్ల మోసం వెలుగులోకి రావడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. హర్యానా ప్రభుత్వ ఖాతాకు సంబంధించిన ఈ ఘటనలో బ్యాంకు షేరు ధరలు గణనీయంగా పడిపోయాయి. అయితే రిజర్వు బ్యాంకు గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందిస్తూ బ్యాంకింగ్ వ్యవస్థలో ఎలాంటి వ్యవస్థాపరమైన సమస్యలేవీ లేవని స్పష్టం చేశారు. వ్యక్తిగత బ్యాంకులపై వ్యాఖ్యానించబోమని తెలిపారు. కొందరు ఉద్యోగుల కుమ్మక్కుతో మోసం జరిగిందని బ్యాంకు యాజమాన్యం వెల్లడించింది. స్వతంత్ర దర్యాప్తు కోసం ప్రత్యేక ఆడిట్ను నియమించినట్లు తెలిపింది.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మోసం కేసు… వ్యవస్థాపరమైన సమస్యలేవీ లేవని ఆర్బీఐ గవర్నర్ హామీ
10
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan