ఫిబ్రవరి చివర్లో ఆకాశ ప్రేమికులకు అరుదైన ఖగోళ దృశ్యం కనిపించనుంది. ‘ప్లానెటరీ పరేడ్’గా పిలిచే ఈ ఘటనలో ఒకేసారి ఆరు గ్రహాలు దర్శనమివ్వనున్నాయి. ఫిబ్రవరి 28, శనివారం సూర్యాస్తమయం అనంతరం పడమటి దిశగా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే మెర్క్యురీ, వీనస్, జూపిటర్, శాటర్న్ కంటిచూపుతోనే కనిపిస్తాయి. యూరేనస్, నెప్ట్యూన్ను చూడాలంటే బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్ అవసరం అవుతుందని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఈ ఖగోళ దృశ్యం కొన్ని రోజులపాటు కొనసాగనుంది