విశాఖలో ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్ పనులను వేగవంతం చేయాలని మంత్రి నారా లోకేశ్ ఆ సంస్థ CEO రవికుమార్ సింగిశెట్టిని కోరారు. దావోస్లో ఆయనతో భేటీ అయిన లోకేశ్, తాత్కాలిక సౌకర్యాల ద్వారా ఉద్యోగుల సంఖ్యను పెంచే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అలాగే AI, క్లౌడ్, డేటా, డిజిటల్ ఇంజినీరింగ్, CTS నియామక అవసరాల కోసం కాగ్నిజెంట్ ఆధ్వర్యంలో డెడికేటెడ్ సెంట్రలైజ్డ్ స్కిల్లింగ్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరినట్లు సమాచారం.
విశాఖకు కాగ్నిజెంట్ గుడ్ న్యూస్.. ఉద్యోగాలపై మంత్రి లోకేశ్ కీలక చర్చలు!
2
Published on: 📅 31 Mar 2026, 09:23 AM
Reporter: 🖊