four prominent individuals nominated to the rajya sabha here are the details

రాజ్యసభకు నలుగురు ప్రముఖులు నామినేట్.. వివ‌రాలివే!

Published on: 📅 01 Apr 2026, 08:37 AM
Reporter: 🖊

రాష్ట్రపతి ద్రౌపదిముర్ము తాజాగా నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్‌ చేశారు. పలువురు రాజ్య‌స‌భ సభ్యుల పదవీకాలం ముగియడంతో.. వారి స్థానంలో రాష్ట్రపతి కోటాలో కొత్త‌గా న‌లుగుర్ని నామినేట్ చేయ‌డం జ‌రిగింది. ఈ జాబితాలో హర్ష్ వర్ధన్ శ్రింగ్లా, ఉజ్వల్ దియోరావ్ నికమ్, డాక్ట‌ర్ మీనాక్షి జైన్, సి సదానందన్ మాస్టర్ ఉన్నారు. రాజ్యసభకు 12 మంది సభ్యులను నామినేట్ చేసే అధికారం భార‌త రాష్ట్ర‌ప‌తికి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(a) ప్రకారం..సాహిత్యం, సైన్స్, కళ మరియు సామాజిక సేవలో ప్రత్యేక జ్ఞానం లేదా ఆచరణాత్మక అనుభవం ఉన్న సభ్యులను నామినేట్ చేయడానికి ఆమెకు వీలుంటుంది.

Sponsored