అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అభివృద్ధి చేయడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ రెండు ప్రధాన ప్రాజెక్టులను 2,534 కోట్లు రూపాయల వ్యయంతో ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.
మొదటి ప్రాజెక్ట్ 17 ఎకరాల GPRA నివాస ప్రాంగణంలో 1,504 నివాస యూనిట్లు, 11 టవర్స్, 31.3 లక్షల చదరపు అడుగుల నిర్మాణం కలిగిన జనరల్ పూల్ రిసిడెన్షియల్ యూనిట్ల నిర్మాణానికి సంబంధించినది. 1,972 కార్లకి భూగర్భ పార్కింగ్ ఏర్పాట్లు ఉంటాయి. ఈ నివాస ప్రాంగణం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉద్యోగ సమీపంలో సౌకర్యవంతమైన నివాసాన్ని అందించి సమర్థత, సిబ్బంది సంక్షేమాన్ని పెంచుతుంది.
రెండవ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ (CGGPOA) 5.53 ఎకరాల్లో, 2 హై-రైజ్ బ్లాక్స్, 13 అంతస్తులు, 8,000 మంది అధికారుల కోసం 23.25 లక్షల చదరపు అడుగుల నిర్మాణం కలిగిన ఆఫీస్ కాంప్లెక్స్. ఇందులో బాంకులు, ATMలు, పోస్టాఫీసులు, క్రేచ్లు, సమావేశ హాల్స్, ఫుడ్ కోర్టులు, షాపింగ్, గెస్ట్ అకామిడేషన్, కాంటీన్లు ఉంటాయి. దివ్యాంగులకు అనుకూలంగా డిజైన్ చేయబడుతుంది.
ప్రాజెక్టులు GRIHA 4-స్టార్, ECSBC 2024, Eco-Niwas Samhita 2024 ప్రమాణాలనుసరిస్తాయి. నిర్మాణంలో సంవత్సరానికి 7 లక్షల మన్-డేస్, ఆపరేషన్లో 50,000 మన్-డేస్ ఉపాధి కలిగిస్తాయి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సమన్వయం పెరిగి ప్రజలకు వేగవంతమైన సేవలు అందుతాయని, రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలకు తోడ్పడుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టులు అమరావతిని గ్లోబల్ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే ప్రధాన మైలురాయి అవుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.
అమరావతిలో 2,534 కోట్లు కేంద్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల ఆమోదం
12
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan