a former minister standing in line for urea like an ordinary farmer

సామాన్య రైతులా యూరియా కోసం క్యూలో నిల్చొన్న మాజీ మంత్రి.. !

1

Published on: 📅 31 Mar 2026, 09:46 AM
Reporter: 🖊

యూరియా బస్తాల కోసం సామాన్యు రైతు మాదిరిగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ మహిళా నేత సత్యవతి రాథోడ్ క్యూలైన్‌లో నిల్చుని, తన వంతు వచ్చే వరకూ వేచిచూసి కూపన్ రాయించుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలోని కురవి మండలంలో గుండాతమడుగు సహకారం సంఘం వద్ద రైతులకు యూరియా పంపిణీ జరుగుతుండగా.. సత్యవతి రాథోడ్ అక్కడకు వచ్చారు. తనకున్న ఐదెకరాల వ్యవసాయ భూమి పట్టాదారు పాస్‌ పుస్తకంతో క్యూలైన్‌లో నిలబడ్డారు. మిగతా రైతులతో పాటు యూరియాకు కూపన్లు రాయించుకున్నారు.

Sponsored