పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ - పాక్ మధ్య మరింత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఎక్కువ సంబంధం ఉండేది క్రికెట్లోనే. అయితే, ఆ క్రికెట్లో కూడా పాక్తో ఆడకుండా ఆ దేశాన్ని నిషేధించాలంటూ భారతీయులు దేశవ్యాప్తంగా ఎన్నో నిరసనలు చేసి సుప్రీంకోర్టులో కూడా పిల్ దాఖలు చేశారు. అయితే, ఐసీసీ రూల్స్ ప్రకారం అది విరుద్ధమని భారత ప్రభుత్వం అంగీకారంతోనే బీసీసీఐ పాక్తో ఆసియా కప్ ఆడడానికి అంగీకరించింది.
పాక్ అహంకారానికి భారత్ సరైన గుణపాఠం.. కనీసం షేక్ హ్యాండ్స్ కూడా ఇవ్వని టీమిండియా!
Published on: 15-09-2025