ఆసియాకప్ 2025లో టీమిండియా జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో యూఏఈని చిత్తు చేసిన భారత్.. రెండో మ్యాచ్లో దాయాది పాకిస్థాన్పై ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. దీంతో పాకిస్థాన్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. పెవిలియన్కు క్యూ కట్టారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.