ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 2026 జనవరి 3 నుంచి 5 వరకు గుంటూరులోని అమరావతిలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఎన్టీఆర్ పేరిట ఈ సభలను నిర్వహిస్తున్నారు. జనవరి 5న జరిగే ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా రావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఆహ్వానం అందింది. పరిషత్ అధ్యక్షుడు డా. గజ్జల్ శ్రీనివాస్ సతీసమేతంగా ఆయనను కలిసి ఆహ్వానించారు. వెంకయ్యనాయుడు దీనికి సానుకూలంగా స్పందించినట్లు డా. శ్రీనివాస్ తెలిపారు.