బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ ప్రభుత్వానికి లేఖ.. మత్స్యకారులను స్వదేశానికి తీసుకొస్తాం: మంత్రి అచ్చెన్న

Published on: 23-10-2025

బంగ్లాదేశ్ నావికాదళం అదుపులో ఉన్న మత్స్యకారులను స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఈ విషయమై బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాశామని తెలిపారు. విజయనగరం జిల్లాకు చెందిన 8 మంది మత్స్యకారులను వెనక్కి రప్పించేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా సంప్రదింపులు జరుగుతున్నాయని వివరించారు. మత్స్యకార కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారికి రక్షణ కవచంలా ఉంటుందని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు

Sponsored