పశ్చిమ బెంగాల్ (West Bengal)లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతోన్నాయి. భాజపా నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్యతో బెంగాల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముందస్తు ప్రణాళికతోనే ఈ హత్య జరిగిందని సువేందు ఆరోపించారు. హంతకులు రెండు రోజుల పాటు ఈ ప్రాంతంలో రెక్కీ నిర్వహించారన్నారు.
ఈ ఘటనపై సువేందు విలేకరులతో మాట్లాడుతూ, "ఇది హృదయవిదారకం. మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడి జరిగిన తీరును బట్టి చూస్తే.. దుండగులు ముందుగానే రెక్కీ నిర్వహించారని స్పష్టంగా తెలుస్తోంది. ఇది గత 15ఏళ్ల అరాచక పాలన ఫలితం. గూండాలను ఏరివేసే ప్రక్షాళన కార్యక్రమాన్ని భాజపా ప్రారంభిస్తుంది" అని అన్నారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిద్ధ్నాథ్ గుప్తా తనకు హామీ ఇచ్చారన్నారు. బుధవారం రాత్రి బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యమ్గ్రామ్లో ఈ హత్య జరిగింది. రథ్ ప్రయాణిస్తున్న కారును దుండగులు వెంబడించి మరీ.. కారు కిటికీలోంచి ఆయనపై కాల్పులు జరిపారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ఘటనలో రథ్ ప్రాణాలు కోల్పోగా.. అతడి డ్రైవర్కు బులెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు, భాజపా నేత సువేందు ఆరోపణలు
0
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan