rs 100 crore commission for each medical college

ఒక్కో వైద్య కళాశాలకు రూ.100 కోట్ల కమిషన్

2

Published on: 📅 31 Mar 2026, 11:19 AM
Reporter: 🖊

గత ప్రభుత్వ హయాంలో కొత్త వైద్య కళాశాలల నిర్మాణంలో వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని విద్యార్థి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్ ఆరోపించారు. ఒక్కో వైద్య కళాశాలకు రూ.100 కోట్లు కమిషన్‌గా తీసుకున్నారని ఆయన అన్నారు. నిబంధనల ప్రకారం రూ.320 కోట్లతో పూర్తి కావాల్సిన నిర్మాణాలను రూ.500 నుంచి రూ.600 కోట్లకు పెంచి, పనులు అప్పగించారని పేర్కొన్నారు. ప్రజలను రెచ్చగొట్టేందుకే మాజీ ముఖ్యమంత్రి పర్యటనలు చేస్తున్నారని, నకిలీ విద్యకు ఆపరేషన్ జగన్ అని పేరు పెట్టాలని మంత్రి డిమాండ్‌ చేశారు.

Sponsored