పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి ఆసియాకప్ 2025లో భాగంగా భారత్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. అయితే ఉగ్రవాదులను తయారు చేసే పాకిస్థాన్తో వ్యాపార, క్రీడా సంబంధాలకు ముగింపు పలకాలనే డిమాండ్లు భారీగా వినిపిస్తున్నాయి. దీంతో భారత్, పాక్ మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. కాగా వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్లో భాగంగా ఇటీవల ఇండియా ఛాంపియన్స్ జట్టు.. పాకిస్థాన్తో మ్యాచ్ను బాయ్కాట్ చేసింది. లీగ్ దశలో ఓసారి.. సెమీఫైనల్లో మరోసారి ఇదే రిపీట్ చేసింది. తాను పాక్తో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆడబోమని శిఖర్ ధావన్, హర్బజన్ సింగ్ లాంటి మాజీ ప్లేయర్లు తేల్చిచెప్పారు.
బాయ్కాట్ డిమాండ్ల మధ్య భారత్ vs పాక్ మ్యాచ్పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!
Published on: 13-09-2025