ఆసియా కప్ 2025లో భారత్ తన ప్రస్థానాన్ని యూఏఈతో ప్రారంభించనుండగా, బుమ్రాను ఆడించాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అభిప్రాయపడ్డాడు. బలహీన జట్టుతో మ్యాచ్లో అతనికి విశ్రాంతిని ఇవ్వాలని సూచించారు. దీనికి ఇర్ఫాన్ పఠాన్ మద్దతు తెలుపుతూ, సిరీస్ ఆడేందుకు వచ్చాక వర్క్లోడ్ మేనేజ్మెంట్ ఉండకూడదని అన్నాడు. జట్టులో బుమ్రా, అర్ష్దీప్, వరుణ్, అక్షర్లతో బౌలింగ్ లైనప్ బలంగా ఉంటుందని.. కుల్దీప్ యాదవ్కి చోటు దక్కకపోవచ్చని పఠాన్ పేర్కొన్నాడు.
Jasprit Bumrah: యూఏఈతో మ్యాచ్కి బుమ్రా కావాలా? గంభీర్కి జడేజా హెచ్చరిక!
Published on: 11-09-2025