ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైన్యం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధాలను ఉపయోగించింది. అయితే, మేకిన్ ఇండియాలో తయారైన 'సంభవ్' ఫోన్లను వినియోగించిందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. విదేశీ యాప్లకు బదులుగా, సురక్షిత కమ్యూనికేషన్ కోసం ఈ ఫోన్లను ఉపయోగించామని, ప్రస్తుతం వాటిని అప్గ్రేడ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా అభివృద్ధి చేసిన ఈ ఫోన్లు 5G సపోర్ట్తో తక్షణ కనెక్టివిటీని అందిస్తాయి.
ఆపరేషన్ సిందూర్లో వాట్సాప్కు బదులు సైన్యానికి ‘సంభవ్’ ఫోన్లు.. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
Published on: 10-09-2025