ఇంట గెలిచి రచ్చ గెలిచిన కథానాయిక ప్రియాంక చోప్రా ఇప్పుడు బాలీవుడ్తో పాటు హాలీవుడ్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అవుతూ మహేష్ బాబు నటిస్తున్న ‘SSMB 29’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇదిలావుండగా బాలీవుడ్లో హీరోయిన్ల పరిస్థితిపై ఆమె చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బాలీవుడ్లో మగాళ్ల ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోందని, అయితే తాము హీరోలకు ఏమాత్రం తీసిపోమని ప్రియాంక స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఎంత చేసినా తక్కువే ఇస్తారు.. బాలీవుడ్పై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్
Published on: 23-08-2025