bandi sanjay begins anjanna ashirvada yatra to kondagattu

అంజన్న ఆశీర్వాద యాత్రకు బండి శ్రీకారం.. 10 వేల మందితో కొండగట్టు పాదయాత్ర

4

Published on: 📅 14 Mar 2026, 11:44 AM
Reporter: 🖊 Suresh Reddy

కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు అంజన్న ఆలయం వరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరుతో మహా పాదయాత్ర ప్రారంభించారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయాలు సాధించడంతో మొక్కు తీర్చుకునేందుకు ఈ యాత్ర చేపట్టినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్తగా గెలిచిన ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు ఆయన వెంట నడిచారు. దాదాపు 10 వేల మంది కార్యకర్తలు పాల్గొంటుండగా, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ బలం మరోసారి ప్రదర్శనకు వచ్చినట్టైంది.

Sponsored