అమెరికాలో హెచ్-1బీ వీసా మోసాలు, మనీ లాండరింగ్, పన్ను ఎగవేత కేసులో భారత సంతతి సోదరులు భాస్కర్ సవానీ, అరుణ్ సవానీని స్థానిక కోర్టు దోషులుగా తేల్చింది. వీరిద్దరికీ కలిపి 400 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. సవానీ గ్రూప్ పేరుతో విదేశీ ఉద్యోగులను అక్రమంగా నియమిస్తూ వీసా మోసాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే హెల్త్కేర్ స్కీమ్లో తప్పుడు బిల్లులతో భారీ మోసాలు, మనీ లాండరింగ్, పన్ను ఎగవేత కూడా చేసినట్లు దర్యాప్తులో తేలింది.
హెచ్-1బీ వీసా మోసం కేసులో భారత సంతతి సోదరులు దోషులు
7
Published on: 📅 12 Mar 2026, 06:58 PM
Reporter: 🖊 Suresh Reddy