టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టీ20 వరల్డ్ కప్ విజయాన్ని ద్రవిడ్, లక్ష్మణ్, అగార్కర్లకు అంకితం చేశారు. జట్టు విజయపథంలో నడవడానికి అవసరమైన వ్యవస్థను వారు నిర్మించారని కొనియాడారు. ద్రవిడ్ కోచ్గా ఉన్న సమయంలో జట్టులో స్థిరత్వం తీసుకొచ్చారని పేర్కొన్నారు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ హెడ్ లక్ష్మణ్ దేశవ్యాప్తంగా ప్రతిభావంతులను వెలికితీస్తున్నారని తెలిపారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నిబద్ధత, నిజాయతీతో పని చేస్తున్నారని గంభీర్ ప్రశంసించారు.
ఆ ముగ్గురికీ T20WC ట్రోఫీ అంకితం: గంభీర్
2
Published on: 📅 09 Mar 2026, 03:14 PM
Reporter: 🖊 Anitha Sharma