టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియాకు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీతో పాటు క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ జట్టును అభినందించారు. ఈ విజయం అసాధారణ నైపుణ్యం, దృఢ సంకల్పం, జట్టు కృషికి నిదర్శనమని మోదీ ట్వీట్ చేశారు. ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండిపోయిందన్నారు. భారత్ ప్రత్యేకమైన క్రికెట్ ఆడిందని సచిన్ ప్రశంసించారు. టోర్నీలో భారత్ ఆటకు సాటిలేదని, క్లిష్ట పరిస్థితుల్లోనూ అద్భుతంగా పోరాడారని కోహ్లీ పేర్కొన్నారు.
టీమ్ ఇండియాకు అభినందనల వెల్లువ
3