కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి జాతీయ రహదారి పైనుంచి సర్వీస్ రోడ్డులోకి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో విజయవాడ, కందెడ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మొత్తం నలుగురు యువకులు మరణించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.