ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబరు 16న ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. రాష్ట్ర పర్యటనపై ఎక్స్ (X) వేదికగా ఆయన తెలుగులో పోస్టు చేశారు. కర్నూలులో రూ. 13,400 కోట్లుకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటానని ఆయన పేర్కొన్నారు.ఆయన తన పర్యటనలో రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం యొక్క నిబద్ధతను పునరుద్ఘాటిస్తారు. స్థానిక ప్రజలు, నాయకులతో కూడా ఆయన సంభాషించే అవకాశం ఉంది.
ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంటా
4
Published on: 📅 31 Mar 2026, 11:03 AM
Reporter: 🖊