నాడు మంత్రివర్గ సమావేశంలో పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు లక్ష్మణ్ అభ్యంతరం చెప్పడంతో వివాదం తలెత్తింది. లక్ష్మణ్కు ఎటువంటి దురుద్దేశం లేదని, ఆయన కేవలం తన అభిప్రాయం చెప్పారనీ పొన్నం స్పష్టం చేశారు. లక్ష్మణ్ తన సహచరుడనీ, సమస్యను ఇక్కడితో ముగించాలని కోరుతూ, పొన్నం చివరికి లక్ష్మణ్కు క్షమాపణలు చెప్పారు. సమస్య పరిష్కారమైందని, ఇకపై అంతా కలిసికట్టుగా పనిచేస్తామనీ పొన్నం తెలిపారు.