వలస కూలీల పిల్లలు, పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించడానికి, ఇన్నోసిస్ ఫౌండేషన్ సహకారంతో 'ప్రాణ' స్వచ్ఛంద సంస్థ 38 ట్యాబ్లను పంపిణీ చేసింది. 6-9 తరగతుల విద్యార్థులు వీటిని ఉపయోగిస్తారు. ట్యాబ్లలో నైపుణ్యాభివృద్ధికి, క్వాలిటీ ఎడ్యుకేషన్కు ఉపయోగపడే కోడింగ్, టైపింగ్, ఆర్ట్స్ వంటి 30 రకాల శిక్షణా యాప్లు ఉన్నాయి. ఈ ప్రయత్నం పేద విద్యార్థులలో నైపుణ్యాలను పెంచి, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.