రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. అర్హులైన ప్రతి కుటుంబానికి రాబోయే నాలుగేళ్లల్లో ఇల్లు లేదా ఇంటి స్థలం అందించేలా చూడాలని.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ మేరకు చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చొప్పున ఇంటి స్థలం అందించేలా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.