టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా.. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2003లో భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన ఈ ప్లేయర్.. సుదీర్ఘ క్రికెట్ కెరీర్కు ముగింపు పలికాడు. కానీ, 2017లో అతడు భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. ఇక ఐపీఎల్లో మూడు హ్యాట్రిక్లు తీసిన బౌలర్గా నిలిచాడు. చివరిసారి ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున బరిలోకి దిగాడీ 42 ఏళ్ల ఈ లెగ్ స్పిన్నర్.