ఆసియా కప్ 2025 సమీపిస్తుండటంతో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ తన ఫామ్ నిరూపించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కేరళ క్రికెట్ లీగ్లో ఓపెనర్గా బరిలోకి దిగి వరుసగా రాణిస్తున్నాడు. ఇవాళ జరిగిన మ్యాచ్లో 62 పరుగులు చేశాడు. అంతకుముందు మ్యాచ్లలో సెంచరీ నమోదు చేశాడు. సంజూ వరుసగా మూడు మ్యాచ్లలో 121, 89, 62 పరుగులు చేశాడు. శుభ్మన్ గిల్ రాకతో సంజూ స్థానం ప్రశ్నార్థకంగా మారిన వేళ, లీగ్లో సత్తా చాటుతూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.