పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడుతోంది. వరుసగా మూడో రోజు సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ సుమారు 1300 పాయింట్లు పడిపోవడంతో 75 వేల దిగువకు చేరింది. నిఫ్టీ కూడా 400 పాయింట్లకు పైగా క్షీణించింది. దీంతో మదుపర్ల సంపద దాదాపు రూ.9 లక్షల కోట్లు ఆవిరైంది. ఎల్అండ్టీ, టాటా స్టీల్, మారుతీ సుజుకీ వంటి ప్రధాన స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతుండగా రూపాయి విలువ కూడా డాలర్తో పోలిస్తే తగ్గింది.
యుద్ధ ప్రభావం స్టాక్ మార్కెట్లపై.. సెన్సెక్స్ 1300 పాయింట్లు పతనం
6
Published on: 📅 13 Mar 2026, 02:58 PM
Reporter: 🖊 Anitha Sharma